రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2282కు చేరింది. 50 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 1527 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 705 మంది ఉన్నారు.
గత 24 గంటల్లో క్రిష్ణా జిల్లాలో 15, చిత్తూరు 15, నెల్లూరు 7, తూర్పుగోదావరి 5, కర్నూలు 4, కడప 2, విశాఖ 1, విజయనగరం 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఇందులో చిత్తూరు నుంచి 12, నెల్లూరు 7 కేసులు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చిన వారు ఉన్నారు. గడచిన 24 గంటల్లో 9,713 శాంపిల్స్ పరీక్షించగా 52 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
జిల్లా పేరు | కేసుల సంఖ్య | డిశ్చార్జ్ అయిన వారు |
కర్నూలు | 615 | 433 |
గుంటూరు | 417 | 315 |
క్రిష్ణా | 382 | 263 |
చిత్తూరు | 192 | 82 |
నెల్లూరు | 157 | 94 |
అనంతపురం | 122 | 73 |
కడప | 104 | 69 |
విశాఖపట్నం | 76 | 37 |
పశ్చిమ గోదావరి | 72 | 51 |
ప్రకాశం | 66 | 63 |
తూర్పు గోదావరి | 57 | 43 |
శ్రీకాకుళం | 14 | 4 |
విజయనగరం | 8 | 0 |
మొత్తం | 2282 | 1527 |