ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2282కు చేరింది. 50 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 1527 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 705 మంది ఉన్నారు. 

గత 24 గంటల్లో క్రిష్ణా జిల్లాలో 15, చిత్తూరు 15, నెల్లూరు 7, తూర్పుగోదావరి 5, కర్నూలు 4, కడప 2, విశాఖ 1, విజయనగరం 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఇందులో చిత్తూరు నుంచి 12, నెల్లూరు 7 కేసులు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చిన వారు ఉన్నారు. గడచిన 24 గంటల్లో 9,713 శాంపిల్స్ పరీక్షించగా 52 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

 

జిల్లా పేరుకేసుల సంఖ్యడిశ్చార్జ్ అయిన వారు
కర్నూలు615433
గుంటూరు417315
క్రిష్ణా382263
చిత్తూరు19282
నెల్లూరు15794
అనంతపురం12273
కడప10469
విశాఖపట్నం7637
పశ్చిమ గోదావరి7251
ప్రకాశం6663
తూర్పు గోదావరి5743
శ్రీకాకుళం144
విజయనగరం80
మొత్తం22821527

 

Leave a Comment