ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఏపీలో ప్రతి ఒక్కరికీ లబ్ధి

కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ లో పేదలతో పాటు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని ఏపీ సీఎస్ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక ప్యాకేజి అమలుపై సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటి(ఎస్ఎల్సి) సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతో ఏఏ శాఖకు ఎంత మేరకు నిధులు సమకూరుతాయో అంచానా వేసి ఆ ప్రకారం వివిధ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. ఈ విషయంపై వచ్చే సమావేశంలో వివరంగా చర్చించేందుకు నిర్ణయించారు. ఈ లోగా ఆయా శాఖల వారీ పూర్తి సమగ్ర కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. 

 

Leave a Comment