‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’కు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్..!

సామాన్యంగా క్రికెట్ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసిన క్రికెటర్ కు అవార్డు, క్యాష్ ప్రైజ్ ఇస్తారు. కాగా, దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండుపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో సెంచరీకి చేరువలో ఉన్నాయి. ఈనేపథ్యంలో వాటికి నిరసనగా ఓ క్రికెట్ టోర్నీ నిర్వాహకులు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ప్లేయర్ కు పెట్రోల్ గిఫ్ట్ గా ఇచ్చారు. 

ఇటీవల భోపాల్ లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్ కు 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ ను నిర్వాహకులు గిఫ్ట్ గా అందించారు. సలావుద్దీన్ అబ్బసీ ఈ పెట్రో అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును భోపాల్ కాంగ్రెస్ నాయకుడు మనోజ్ శుక్లా అందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

Leave a Comment