ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2561కు చేరింది. ఇప్పటి వరకు 56 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 1778 మంది డిశ్చార్జ్ కాగా, 727 మంది చికిత్స పొందుతున్నారు. 

దేశంలో మరింత వ్యాప్తి..

భారత దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 6654 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. ఇప్పటి వరకు 3720 మంది మరణించారు. అయితే ప్రస్తుతం దేశంలో 69,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

 

Leave a Comment