‘కరెన్సీ నోట్లపై వారి ఫొటోలు ఉండాలి’..నాగబాబు మరోసారి సంచలన ట్వీట్..

జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు మరో సారి సంచలన ట్విట్ చేశాడు. ‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్ పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులను జనం మర్చిపోకూడదని ఒక ఆశ’ అంటూ నాగబాబు ట్విట్ చేశాడు. 

‘ గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశ భక్తులను గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అంటూ మరో ట్విట్ చేశారు. 

ఇటీవల మహాత్మగాంధీని చంపిన నాథూరాం గాడ్సే నిజమైన దేశ భక్తుడు అంటూ వివాదాస్పద ట్వీట్ చేసి గాంధేయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ ట్విట్ పై ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలపై కొంత మంది మండిపడుతుండగా, మరి కొందరు సమర్థిస్తున్నారు. 

Leave a Comment