దేశంలో కరోనా కల్లోలం..!

దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా 45,720 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. 24 గంటల్లో కరోనా వైరస్ తో 1129 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 30,000లకు చేరింది.

దేశంలో ఇప్పటి వరకు 12,38,635 కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 7,82,606 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 4,26,167 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాను నిరోధించే వ్యాక్సిన్ తయారీలో ప్రయాగాలు మంచి పురోగతిని సాధిస్తున్నట్లుగా పలు సంస్థలు ప్రకటించాయి. కొన్ని సంస్థల ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. 2021 తర్వాత వ్యాక్సిన్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 

Leave a Comment