ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1930కు చేరింది. ఇప్పటి వరకు 44 మంది మరణించారు. ప్రస్తుతం 999 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 887 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 16, చిత్తూరు 11, కర్నూలు 6, విశాఖ 5, అనంతపురం 3, గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. 8,388 శాంపిల్స్ పరీక్షించగా 43 మంది కరోనా పాజిటి్ గా నిర్ధారించబడ్డారు. ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 553 కరోనా కేసులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 61 కేసుల్లో 60 మంది డిశ్చార్జ్ కావడం గమనార్హం. అక్కడ కేవలం ఒక్క యాక్టివ్ కేసు మాత్రమే ఉంది. 

జిల్లాల వారీగా కరోనా కేసుల సంఖ్య..

 

జిల్లా పేరుకరోనా కేసుల సంఖ్యచికిత్స పొందుతున్న వారు
కర్నూలు553320
గుంటూరు376200
క్రిష్ణా338191
అనంతరపురం10254
చిత్తూరు9622
కడప9653
నెల్లూరు9632
పశ్చిమ గోదావరి6835
విశాఖపట్నం6238
ప్రకాశం611
తూర్పుగోదావరి4617
శ్రీకాకుళం55
విజయనగరం44
ఇతరులు2727
మొత్తం 1930999

 

Leave a Comment