రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1930కు చేరింది. ఇప్పటి వరకు 44 మంది మరణించారు. ప్రస్తుతం 999 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 887 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 16, చిత్తూరు 11, కర్నూలు 6, విశాఖ 5, అనంతపురం 3, గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. 8,388 శాంపిల్స్ పరీక్షించగా 43 మంది కరోనా పాజిటి్ గా నిర్ధారించబడ్డారు. ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 553 కరోనా కేసులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 61 కేసుల్లో 60 మంది డిశ్చార్జ్ కావడం గమనార్హం. అక్కడ కేవలం ఒక్క యాక్టివ్ కేసు మాత్రమే ఉంది.
జిల్లాల వారీగా కరోనా కేసుల సంఖ్య..
జిల్లా పేరు | కరోనా కేసుల సంఖ్య | చికిత్స పొందుతున్న వారు |
కర్నూలు | 553 | 320 |
గుంటూరు | 376 | 200 |
క్రిష్ణా | 338 | 191 |
అనంతరపురం | 102 | 54 |
చిత్తూరు | 96 | 22 |
కడప | 96 | 53 |
నెల్లూరు | 96 | 32 |
పశ్చిమ గోదావరి | 68 | 35 |
విశాఖపట్నం | 62 | 38 |
ప్రకాశం | 61 | 1 |
తూర్పుగోదావరి | 46 | 17 |
శ్రీకాకుళం | 5 | 5 |
విజయనగరం | 4 | 4 |
ఇతరులు | 27 | 27 |
మొత్తం | 1930 | 999 |