ఏపీలో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుమొహం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2100కు చేరింది. ఇప్పటి వరకు 48 మంది మరణించారు. 1192 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 860కు చేరింది. 

రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో నెల్లూరు జిల్లాలో 15, చిత్తూరు 9, గుంటూరు 5, కడప 2, క్రిష్ణా 2, పశ్చిమ గోదావరి 1 కేసులు నమోదయ్యాయి. కర్నూలు  జిల్లాలో ఒక్క కేసులు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

గడచిన 24 గంటల్లో 9,256 శాంపిల్స్ ను పరీక్షించగా 68 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. వీటిలో 32 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల సంఖ్య..

 

జిల్లా పేరుకరోనా కేసుల సంఖ్య యాక్టివ్ కేసులు
కర్నూలు591257
గుంటూరు404150
క్రిష్ణా351134
చిత్తూరు15174
నెల్లూరు12645
అనంతపురం11862
కడప9943
పశ్చిమ గోదావరి6929
విశాఖపట్నం6640
ప్రకాశం633
తూర్పుగోదావరి5116
శ్రీకాకుళం73
విజయనగరం44
మొత్తం2100860

 

Leave a Comment