కేసు క్లోజ్ చేయండి : విజయ్ మాల్యా

తాను చెల్లించాల్సిన 100 శాతం రుణాలను తిరిగి చెల్లిస్తానన్న తన ప్రతిపాదనను అంగీకరించాలని, తనపై కేసును మూసివేయాలని విజయ్ మాల్యా ప్రభుత్వాన్ని కోరారు. వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై భారత ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్విట్ చేశారు. 

భారత ప్రభుత్వం తాను కోరుకున్నంత కరెన్సీని ముద్రించుకోవచ్చని, కానీ తన లాంటి చిన్న చెల్లింపుదారుడు ప్రభుత్వ బ్యాంకుల రుణాలను పూర్తిగా చెల్లిస్తారని ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. తాను తీసుకున్న అప్పు 100 శాతం చెల్లిస్తానని ఎన్నిసార్లు అభ్యర్థించినా తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. మొత్తం నగదును తీసుకొని తన కేసును క్లోజ్ చేయాలని కోరారు. 

Leave a Comment