పెళ్లి కావడం లేదన్న బాధతో ఓ యువతి ఆత్మహత్య..!

చూసేందుకు అందంగా.. లక్షణంగా ఉంది.. కానీ అనారోగ్యం.. వయసు మీద పడుతుండటంతో ఓ యువతి మనోవేదనకు గురైంది. తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

ఓల్డ్ మల్లాపూర్ కు చెందిన తొొర్రి నర్సింహ కూతురు అశ్విని(29) గత కొద్ది రోజులుగా అనార్యోంతో బాధపడుతోంది. దీంతో పాటు ఆమెకు వయసు పెరుగుతుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే పెళ్లి చూపుతు చూడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అశ్విని తీవ్ర మనోవేదనకు గురైంది. తనకు పెళ్లి కాదన్న మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరు బాధ్యులు కారని సూసైడ్ నోట్ లో రాసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.     

Leave a Comment