ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2230కు చేరింది. ఇప్పటికీ 50 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 1433 మంది డిశ్చార్జ్ కాగా, 747 మంది చికిత్స పొందుతున్నారు.
గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 4, గుంటూరు 4, కర్నూలు 3, శ్రీకాకుళం 7, ప్రకాశం 3, విశాఖపట్నం 3, నెల్లూరు 1 కేసులు నమోదయ్యాయి. 9,880 శాంపిల్స్ ను పరీక్షించగా 25 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
జిల్లా పేరు | కరోనా కేసలు | డిశ్చార్జ అయిన వారు |
కర్నూలు | 611 | 405 |
గుంటూరు | 417 | 275 |
క్రిష్ణా | 367 | 253 |
చిత్తూరు | 177 | 77 |
నెల్లూరు | 150 | 94 |
అనంతపురం | 122 | 71 |
కడప | 102 | 68 |
విశాఖపట్నం | 75 | 33 |
పశ్చిమ గోదావరి | 70 | 51 |
ప్రకాశం | 66 | 3 |
తూర్పు గోదావరి | 52 | 39 |
శ్రీకాకుళం | 14 | 4 |
విజయనగరం | 7 | 0 |
మొత్తం | 2230 | 1433 |