రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. ఇప్పటి వరకు 45 మంది మరణించారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 975 మంది ఉన్నారు. ఇప్పటికీ కరోనా నుంచి కోలుకుని 998 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 9, చిత్తూరు 9, అనంతపురం 8, గుంటూరు 5, క్రిష్ణా 3, విశాఖ 3, నెల్లూరు 1 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 7,409 శాంపిల్స్ పరీక్షించగా 38 మందికి కోవిడ-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో వచ్చిన 9 కేసుల్లో 8 కేసులు కోయంబేడు నుంచి వచ్చినవిగా గుర్తించారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
జిల్లా పేరు | కేసుల సంఖ్య |
కర్నూలు | 575 |
గుంటూరు | 387 |
క్రిష్ణా | 342 |
చిత్తూరు | 121 |
అనంతపురం | 115 |
నెల్లూరు | 102 |
పశ్చిమ గోదావరి | 68 |
కడప | 97 |
విశాఖపట్నం | 66 |
ప్రకాశం | 63 |
తూర్పు గోదావరి | 46 |
శ్రీకాకుళం | 5 |
విజయనగరం | 4 |
ఇతరులు | 27 |
మొత్తం | 2018 |