ఏపీలో 2018కు చేరిన కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. ఇప్పటి వరకు 45 మంది మరణించారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 975 మంది ఉన్నారు. ఇప్పటికీ కరోనా నుంచి కోలుకుని 998 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 9, చిత్తూరు 9, అనంతపురం 8, గుంటూరు 5, క్రిష్ణా 3, విశాఖ 3, నెల్లూరు 1 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 7,409 శాంపిల్స్ పరీక్షించగా 38 మందికి కోవిడ-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో వచ్చిన 9 కేసుల్లో 8 కేసులు కోయంబేడు నుంచి వచ్చినవిగా గుర్తించారు. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

 

జిల్లా పేరు కేసుల సంఖ్య
కర్నూలు575
గుంటూరు387
క్రిష్ణా342
చిత్తూరు 121
అనంతపురం115
నెల్లూరు102
పశ్చిమ గోదావరి68
కడప97
విశాఖపట్నం66
ప్రకాశం63
తూర్పు గోదావరి46
శ్రీకాకుళం5
విజయనగరం4
ఇతరులు27
మొత్తం2018

 

Leave a Comment