కరోనా బాధితులకు 2వేలు ఆర్థిక సాయం : సీఎం జగన్‌

క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తి చేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, ఇతర అంశాలపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు.

క్వారంటైన్ లో సదుపాయలపై ఆరా..

క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం జగన్‌ మరోసారి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఎలాంటి ఆటకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి బాధితుడికి రోజూ భోజనం, వసతి లాంటి అవసరాల కోసం రూ. 500కు తక్కువ కాకుండా కేటాయించాలని అధికారులకు సూచించారు.

నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు..

 ఈ సందర్భంగా వ్యవసాయం రంగంపై కూడా సీఎం ఆరా తీశారు. అరటి, పుచ్చ ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులను ఆదుకోవడానికి త్వరితగతిన చేపట్టాల్సిన చర్యలను వెంటనే తీసుకోవాలని తెలిపారు. వంటనూనెల ధరలపై దృష్టిపెట్టాలని, అలాగే నిత్యవసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

 

Leave a Comment