ఒకే వ్యక్తిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు..!

కరోనా కాలంలో పెళ్లి కావడమే కష్టంగా మారింది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు..తన చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాలని అక్క కాబోయే భర్తను పట్టుబట్టడంతో ఒప్పుకున్నాడు. కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. 

తాలుకాలోని తిమ్మరావుతనహళ్లి గ్రామ పంచాయతీ వేగమడులు గ్రామానికి చెందిన సుప్రియ, లలిత అక్కాచెల్లిళ్లు.. లలిత మూగ-బధిర.. దీంతో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని అక్క సుప్రయ బాధపడేది.. అయితు సుప్రియకు బాగేపల్లికి చెందిన ఉమాపతి అనే యువకునితో పెళ్లి కుదిరింది. ఈనెల 7న తాళి కట్టబోతుండగా తన చెల్లి లలితను కూడా పెళ్లి చేేసుకోవాలని సుప్రియ కోరింది. 

ఆమెను కూడా పెళ్లి చేసుకుంటే గాని తాను పెళ్లి చేసుకోనని మొండికేసింది. దీంతో పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరికీ తాళి కట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. అయితే లలితకు 18 ఏళ్లు దాటకపోవడంతో శిశు సంక్షేమ, పోలీస్ అధికారులు వచ్చి వరుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 

Leave a Comment