ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నరేంద్ర ;ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రకటించలేదు. అయితే ఆదాయ పన్ను, డివిడెండ్ డిస్ట్రిబ్యుషన్ టాక్స్, ఇతర పన్నుల్లో మార్పులు చేసింది.
బడ్జెట్ లో కీలక అంశాలు..
ధరలు పెరిగేవి…
. వైద్య పరికరాలపై 5 శాతం సెస్
. ఫర్నిచర్, చెప్పులు
. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు
. ఆటో మొబైల్ విడి భాగాలకు పెరిగిన కస్టం సుంకం
ధరలు తగ్గేవి..
. ఎలక్ట్రికల్ మొబైల్ ఫోన్ల విడి భాగాలకు తగ్గిన పన్ను
. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ కు పన్ను తగ్గింపు
. ప్లాస్టిక్ ఆధారిత ముడిసరకు పై కస్టం పన్ను తగ్గింపు
. టెక్స్ టైల్ సెక్టార్ పై ప్రస్తుతమున్న యాంటీ డంపింగ్ డ్యుటీ రద్దు
పాన్ కార్డు, ఆధార్ కార్డు లేకుంటే
. పాన్ కార్డు, ఆధార్ కార్డు లేకుంటే లావాదేవీలపై పన్ను వడ్డన
. పాన్, ఆధార్తో లావాదేవీలు జరిపితే ఒక శాతం పన్ను
. పాన్, ఆధార్ లేకుండా లావాదేవీలు జరిపితే ఐదు శాతం పన్ను
నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు
. మధ్య, ఎగువ మధ్య తరగతిాకి ఊరటనిచ్చేలా చర్యలు
. ఆదాయపన్ను శ్లాబ్లు నాలుగు నుంచి ఏడుకు పెంపు
. 0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు
. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను
. రూ.5-7 లక్షల వారికి ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు
. రూ. 10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం పన్ను
. రూ. 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను
రూ.15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను
కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతం తగ్గింపు
. కార్పొరేట్ పన్నుల తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం.
. కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్సేఛేంజ్ ఏర్పాటు
. కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతం తగ్గింపు
. డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు
. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాల పునరుద్ధరణ గడువు 2021 వరకు పెంపు
. ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ల ప్రత్యేక చట్టం
. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు
బ్యాంకుల్లో డిపాజిటర్ల సొమ్ము సేఫ్
. డిపాజిల్ భీమా పరిధి రూ. లక్ష నుంచి 5 లక్షలకు పెంపు
.సహకార బ్యాంకుల పరిపుష్టి
. గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ ఛేంజ్
. షేర్ల అమ్మకం ద్వారా ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా పాక్షిక విక్రయం
. ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకం
. 2021లో జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుందని ఆశాభావం
2022లో భారత్ లో జీ 20 సదస్సు
. 2022లో భారత్ లో జీ 20 సదస్సును రూ.100 కోట్లతో ఏర్పాటుకు సన్నాహకాలు
ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
. రవాణ రంగ అభివృద్ధికి బడ్జెట్లో కొత్త వ్యూహాలు
. రాంచీలో ట్రైబల్ మ్యూజియం
. అహ్మదాబాద్లో మ్యారిటైమ్ మ్యూజియం
. పర్యాటక అభివృద్ధికి తేజస్ రైళ్లు
. రైల్వేలో మరింత ప్రైవేటీకరణ..పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు
. వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్ పోర్టులు
. 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పూర్తి
. ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు
. పెద్ద సంఖ్యలో తేజస్ తరహా, రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు
కరెంటు బిల్లుల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు
. చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
. త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ
. ఇక నుంచి యంత్రాలతో సెప్టిక్ ట్యాంకుల క్లినిం్
. ప్రైవేటు రంగంలో డేటా సెంటర్ పార్క్ లు ఏర్పాటు
. కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు
వివాహ వయస్సు పెంపుపై టాస్క్ ఫోర్స్
. ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయంలో టాక్స్ ఫోర్స్ ఏర్పాటు
. 6 లక్షల మంది అంగన్ వాడీలకు సెల్ ఫోన్లు
. మహిళా సంక్షేమ పథకాలకు రూ.28,600 కోట్లు
. పౌష్టికాహార పథకానికి రూ.35.6 కోట్లు
. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ
. 284 బిలియన్ డాలర్లకు చేరిన ఎఫ్ డీ ఐలు
. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు
. నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రారంభం
. ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ
కొత్తగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ సెల్..
. యువ పారిశ్రా మిక వేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ సెల్ ఏర్పాటు
. గ్లోబలైజేషన్ కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
రంగాల వారీగా కేటాయింపులు..
- విద్యారంగానికి రూ.99.300 కోట్లు
- జల్ జీవన్ మిషన్ కు రూ.11,500 కోట్లు
- కొత్తగా ైదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
- నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్ మిషన్ ఏర్పాటుకు రూ.1480 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ.27,300 కోట్లు
- రవాణా మౌలిక సదుపాయాలకు రూ.1.7 లక్షల కోట్లు
- సీనియర్ సిటిజ్ల సంక్షేమానికి రూ.9500 కోట్లు
- టూరిజం ప్రోత్సాహానికి రూ.2500 కోట్లు
- సాంస్కృతిక శాఖకు రూ.3150 కోట్లు
వ్యవసాయ రంగానికి పెద్ద పీట
. రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ.2.83 లక్షల కోట్లు
. పంచాయతీరాజ్కు రూ.1.23 లక్షల కోట్లు
. ఆరోగ్య రంగానికి రూ.69,000 కోట్లు
. స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ. 12.300 కోట్లు
. పైప్ డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ.3.6 లక్షల కోట్లు
. గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి
. ఆన్ లైన్లో ఆర్గానికి ఉత్పత్తులు
. 16 లక్షల మంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్
ప్రాధాన్యతా అంశాలు..
తొలి ప్రాధాన్యం – వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
ద్వితీయ ప్రాధాన్యం – ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
మూడో ప్రాధాన్యం – విద్య, చిన్నారుల సంక్షేమం
. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
. 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
. 26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు.