జిల్ల ఆస్పతులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టి పెట్టండి
సీఎం జగన్
అమరావతి : భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యవ్యవస్థను అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆస్పత్రుల్లో నాడు–నేడు, సబ్సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకార్డుల జారీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా మార్చడంపై దృష్టిపెట్టాలన్నారు. దీనివల్ల సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయని, సరిపడా సీట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానం చాలా పాతది అని, కొత్త విధానాలపై ఆలోచనలు చేయాలని అధికారులకు తెలిపారు. 9 చోట్ల బోధనాసుపత్రులు పెట్టేందుకు అవకాశాలున్నాయని, 4 లేదా 5 ఆస్పత్రుల్లో వెంటనే ఈ ప్రతిపాదనను అమలు చేయవచ్చని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వెల్లడించారు. ప్రతి పార్లమెంటుకూ ఒక బోధనాసుపత్రి ఉండేలా చూడాలన్న సీఎం అన్నారు. ఈ బోధనాసుపత్రులను స్వయంశక్తితో నడిచేలా ఆలోచన చేయాలన్నారు. ప్రజారోగ్య రంగంపై ఇదివరకటి ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రతిపార్లమెంటు నియోజకవర్గానికొక బోధానుసుపత్రి ఏర్పాటుచేసి, భవిష్యత్తులోనూ అవి మెరుగ్గా నడిచేలా ఒక ప్రణాళిక తయారు చేయాలని సీఎం పేర్కొన్నారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రాల (సబ్సెంటర్లు) నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు. నాడు– నేడు లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ తెలిపారు.
నాడు – నాడులో భాగం పనులు
- 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నాడు – నేడు కింద అభివృద్ధి పనులు
- కొన్నిచోట్ల కొత్త నిర్మాణాలు
- 11 మెడికల్ కాలేజీలు, 6 బోధనాసుపత్రుల్లో 13 జిల్లా ఆస్పత్రుల్లో నాడు –నేడు కింద పనులు
- కొత్తగా 7 మెడికల్ కాలేజీలలు, 8 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఒక క్యాన్సర్ హాస్పిటల్, 7 నర్సింగ్ కాలేజీలు
- పార్లమెంటు నియోజకవర్గానికో బోధనాసుపత్రి
- ప్రస్తుతం ఉన్న 11 కాలేజీలకు అదనంగా ప్రతిపాదిస్తున్న కాలేజీలతో కలిపి కనీసం 27 నుంచి 28 కాలేజీలు
మెడికల్ కోర్సులపై దృష్టి
రాష్ట్రంలోని సూపర్ స్పెషాల్టీ మెడికల్ కోర్సులపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ సూపర్ స్పెషాల్టీ కోర్సుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు. కర్నూలు–కడప–అనంతపురం, ప్రకాశం–నెల్లూరు– చిత్తూరు
కృష్ణా–గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జోన్లవారీగా సంబంధిత కాలేజీల్లో సూపర్స్పెషాల్టీ కోర్సులపై దృష్టిపెట్టాలని తెలిపారు. ఇంత పెద్దస్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నందున ఒకే యూనివర్సిటీ పర్యవేక్షించడం కష్టమవుతుందని, దీని కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ మూడు మెడికల్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు.
మే నాటికి సిబ్బందిని నియమించాలి..
ఈ ఏడాది మే నెల నాటికి వైద్య–ఆరోగ్యశాఖలో కావాల్సిన సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు.
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి డబ్ల్యూహెచ్ఓ, జీఎంపి (గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు.
ఫిబ్రవరి 17 నుంచి మూడో విడత కంటి వెలుగు
దాదాపు 10 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశామని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కు వివరించారు. జులై వరకూ మూడో విడత కంటి వెలుగు
ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉన్నందున ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందన్నారు. స్క్రీనింగ్, లోపాల గుర్తింపు, కంటి అద్దాల పంపిణీ, ఆపరేషన్లు అన్నీ సమకాలంలో జరుగుతాయని తెలిపారు.
ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని కర్నూలులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
అదేరోజు సబ్సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన, మూడోవిడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్ల సమీక్ష లో తెలిపారు.
డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, టీబీ, లెప్రసీల గుర్తింపునకు త్వరలో విస్తృతంగా పరీక్షలు
ఏప్రిల్ 1నుంచి ప్రారంభిస్తారు. గుర్తించిన వారికి వైద్య వివరాలు ఆరోగ్య కార్డులో పొందుపరచనున్న అధికారులు
మార్చి 15 కల్లా అందరికీ హెల్త్కార్డులు
ఫిబ్రవరి 17న అనీమియా ముక్త్ భారత్
ఐఎఫ్ఏ టాబ్లెట్లు, సిరప్ పంపిణీ
వారానికి రెండు సార్లు 2.85,94,666 మంది పిల్లలు, యువతీ యువకులు, తల్లులు, గర్భిణులపై దృష్టి
సిజేరియన్లపై సీఎం ఆందోళన
అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేయడంపై సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సిజేరియన్ లేకుండా సహజ ప్రసవాలను ప్రోత్సహించాలన్ని, ఆ మేరకు వైద్యులకు సూచనలు చేయాలని సూచించారు.
సదరం సెంటర్లు 52 నుంచి 167కు పెంపు
సదరం సెంటర్లను 52 నుంచి 167కు పెంచనున్నారు. వారానికి 8,680 మందికి స్లాట్లు ఇస్తారు.
డిసెంబర్ 3 నుంచి ఫిబ్రవరి 3 వరకూ 20,642 మందికి సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
ఆరోగ్యశ్రీ కింద 1.63 కోట్ల మందిని నవశకం కింద అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరికి మార్చి 15లోగా కార్డులు జారీ చేస్తారు. హైదరాబాద్లో 72, చెన్నై 23, బెంగుళూరు 35 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తారు.
రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 67వేల మంది అర్హులుగా అధికారులు తేల్చారు. వారికి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయనున్నారు.
వైయస్సార్ ఆరోగ్య ఆసరా కింద 46,725 మందికి ఫిబ్రవరి 2 వరకూ రూ.33.14 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఆస్పత్రి నుంచి రోగి డిశ్చార్జి అవుతున్న సందర్భంలోనే రోగుల విశ్రాంతి సమయానికి ఇవ్వాల్సిన డబ్బును చేతిలో పెట్టాలని సీఎం జగన్ తెలిపారు.