ఎన్ఆర్సీపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభ లిఖిత పూర్వకంగా దీనిపై సమాధానం ఇచ్చింది. ఇప్పటికైనా ఎన్ఆర్సీపై చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని కేంద్రం కోరింది. లోక్ సభలో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలను ప్రతి పక్షాలు అడ్డుకునేందుకు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. దీనికి సమాధానంగా సుప్రీం కోర్టు ఆదేవాలతో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఎన్ఆర్సీని అమలు చేస్తున్నామని, మిగతా రాష్ట్రాల్లో దీని అమలుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ వెల్లడించింది.

Leave a Comment