నేను కనబడగానే లోకేశ్ పారిపోయాడు : కొడాలి నాని

జూమ్ లో తాను కనబడగానే మీటింగ్ కట్ చేసి నారా లోకేశ్ పారిపోయాడని కొడాలి నాని అన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ గురువారం టెన్త్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ జరుగుతుండగా ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. లోకేశ్ జూమ్ మీటింగ్ లో ప్రత్యక్షమవడంపై కొడాలి నాని మాట్లాడారు.

లోకేశ్ పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము ఫేక్ ఐడీలతో లాగిన్ అవ్వలేదని, తన మేనల్లుడి ఐడీతో మాట్లాడేందుకు ప్రయత్నించామని స్పష్టం చేశారు. విద్యార్థి మేనమామతో లోకేశ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 

పిల్లలు కొడతారనే భయంతోనే లోకేశ్‌ జూమ్‌లో మాట్లాడారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. తాను కనపడగానే జూమ్‌ మీటింగ్‌ కట్‌ చేసి పారిపోయారని అన్నారు. విద్యార్థులను పిలిచి మరోసారి చర్చ పెట్టమనండని, తాము వెళ్తామని అన్నారు. తన ప్రశ్నలకు లోకేష్‌ సమాధానం చెబితే బాగుండేదన్నారు.

 

Leave a Comment