వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత..!

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైసీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలియజేశారు. 

సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్ గా ప్రజలకు సేవలందించారు. 2014లో వైసీపీ ద్వారానే ఆయన రాజకీయ రంగప్రవేశం చేశారు. 2016 బద్వేల్ వైసీపీ కో-ఆర్డినేటర్ గా పని చేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

 సీఎం జగన్ దిగ్భ్రాంతి..

బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 

 

Leave a Comment