డీఎంకే పార్టీ నేత డిండిగుల్ లియోని మహిళల శరీరాకృతి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శివసేనాపతి అనే అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రచారంలో ఏమన్నారంటే.. ప్రస్తుతం చాలా రకాల ఆవులు ఉన్నాయని, ఫామ్ లలో మీరు విదేశీ ఆవులను చేసే ఉంటారని అన్నారు. వీటి పాలను పితకడానికి మెషిన్లను వాడతారన్నారు. ఒక్కసారి స్విచ్ వేస్తే మెషిన్ గంటలో 40 లీటర్ల పాలు పితుకుందని చెప్పారు. ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా విదేశీ ఆవు పాలు తాగుతున్నారన్నారు. అందుకే వారి శరీరాకృతి మారి డ్రమ్ముల్లా తయారవుతున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో మహిళలు ‘8’ ఆకారంలో ఉండేవారని, పిల్లల్ని అలవోకగా ఎత్తుకునే వారని అన్నారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా కనిపించడం లేదన్నారు. లావుగా అయ్యి పిల్లలను ఎత్తుకోలేకపోతున్నారన్నారు. దానికి కారణం విదేశీ ఆవు పాలు తాగడమే అంటూ ప్రసంగించారు. లియోని వ్యాఖ్యలపై ఇతర పార్టీ నేతలు, మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు.
What a shame.. what milk does he drink? Does he know what happens to women’s body post pregnancy or during hormonal changes? @KanimozhiDMK what do you like to say to this kind of male chauvinist? Is this the respect your party people have on women. https://t.co/7yMf5esqX0
— Gayathri Raguramm (@BJP_Gayathri_R) March 24, 2021