నెక్ట్స్ ‘గంటా’ మోగుతుందా?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా టీడీపీ నాయకుల అవినీతి బండారాలను ఒక్కొక్కటిగా బయటకు లాగుతోంది. ఇటీవల మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో ఇరికించింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఇదే స్కాంలో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కుమారుడు పితాని సురేష్ కోసం ఏసీబీ పోలీసులు గాలిస్తున్నారు. ఇలా ఒక్కొక్కిటిగా అవినీతిని తిమింగలాలను లాగుతుండటంతో టీడీపీ నేతల్లో గుబులు పుట్టింది. ఇక తర్వాతి అస్త్రం ఎవరి మీదో అంటూ వణికిపోతున్నారు. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నెక్ట్స్ ఎవరనే దానిపై హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

విజయసాయిరెడ్డి,  మాజీ మంత్రి గంట శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ చేసిన ట్విట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో ఉచిత సైకిళ్ల పంపిణీలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనిాసరావు చేసిన అక్రమాలపై విమర్శలు చేశారు. ‘తుప్పు సైకిళ్లపై గంటా శీను గణగణా..12 కోట్ల కొనుగోళ్లలో 5 కోట్ల అవినీతి..ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్ట్ చేసినా..బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ రాజకీయ దుమారమే రేపింది. ఇక తర్వాత టార్గెట్  గంటా శ్రీనివాసరావు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గంటా శ్రీనివాసరావుపై దాడి జరుగుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సిందే..

Leave a Comment