భర్త పురుషాంగంపై మరిగే నీరు పోసిన భార్య..!

ఈమధ్య భర్తను చంపించడాలు.. ప్రియుడి మోజులో పడి హత్య చేయడం లాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా నిద్రపోతున్న భర్త పురుషాంగం మీద సలసల కాగే నీళ్లు పోసింది ఓ భార్య.. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదూ.. పాపం ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటే.. ప్రస్తుతం భర్తను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోె చోటుచేసుకుంది. 

వివరాల మేరకు ఏలూరు నగరంలోని పత్తేబాదలో మాచర్ల నాగేంద్రరావు టైలరింగ్ షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య పద్మావతితో పాటు ఇంజనీరింగ్ చదివే కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా వారి మధ్య వివాదం జరిగింది. ఈక్రమంలో శనివారం ఉదయం భర్త నిద్రపోతున్న సమయంలో సలసల మరిగే వేడి నీటిని అతని మర్మాంగంపై పోసింది. దీంతో వేడిని తట్టుకోలేక చావుకేకలు పెట్టాడు భర్త..కుటుంబ సభ్యులు వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతటి దారుణానికి పాల్పడటానికి కారణం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.  

 

Leave a Comment