మన్మథుడు హీరోయిన్ అన్షు.. ఇప్పుడెలా ఉందో చూశారా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ బెస్ట్ సినిమాల్లో మన్మధుడు ఒకటి.. ఆ సినిమా నాగార్జునకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ప్రేమ విఫలమైన తర్వాత మహిళలపై నమ్మకం కోల్పోయే వ్యక్తిగా నాగార్జున నటించారు. నాగ్ సరసన హీరోయిన్లుగా సోనాలి బింద్రే, అన్షు నటించారు. సోనాలి బింద్రే గురించి అందరికీ తెలిసిందే.. 

అయితే అన్షు మాత్రం మన్మథుడు తర్వాత ప్రభాస్ హీరోగా చేసిన రాఘవేంద్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత తమిళ హీరో ప్రశాంత్ సరసన ఓ సినిమాలో అవకాశం వరించింది. అయితే హీరోయిన్ గా మంచి క్రేజ్ వస్తున్న సమయంలో సినిమాలకు దూరమైంది. 

ఆ తర్వాత తన జన్మస్థలమైన లండన్ కి తిరిగి వెళ్లి అక్కడ తన చదువును పూర్తి చేసింది. సచిన్ సాగ్గర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని యూకేలోనే స్థిరపడింది. అన్షుకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒక పాప, బాబు ఉన్నారు. లండన్ లో ఇన్ స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తోంది.. 

 

 

View this post on Instagram

 

A post shared by Anshu (@actressanshuofficial)

Leave a Comment