రాజధాని అమరావతిలో ఉండేలా పోరాడుతాం – కన్నా

గుంటూరు : రాజధాని అమరావతిలో ఉండేలా తాము పోరాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారంకన్నా లక్ష్మి నారాయణను రాజధాని రైతులు కలిశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ..రాష్ట్ర విభజన తర్వాత రెండు కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఏపీ ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టి..వాగ్దానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం విస్మరిస్తున్నాయన్నారు. 

ప్రభుత్వ విధానాలతో గత 50 రోజులుగా రాష్ట్రం రావణ కాష్టంలా మారిందన్నారు. ప్రభుత్వానికి  అవినీతి తప్ప వేరే ఆలోచన లేదన్నారు. విశాఖ రాజధాని గురించి ఉత్తరాంధ్రలో కూడా సానుకూలంగా లేరన్నాు. ఉత్తరాంధ్రలో కూడా అమరావతి రాజధాని కొనసాగించాలని కోరుతున్నారన్నారు. రాజధాని వస్తే తమకు సమస్యలు వస్తాయని ప్రజలు భయంతో ఉన్నారన్నారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదని, రాష్ట్ర అభివృద్ధికీ సంబంధించినది అని చెప్పారు. గత సీఎం ఇక్కడి రైతుల భూములు తీసుకుని రియల్ వ్యాపారం చేయాలని భావించారని విమర్శించారు. ఇప్పటి సీఎం ఇక్కడ దోచుకోవటానీకి ఏం లేదని విశాఖ వెళ్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచిందన్నారు. ప్రజల రక్తం పీల్చేలా వైసీపీ పాలన సాగుతోందన్నారు. 

Leave a Comment