పింఛన్ డబ్బు తీసుకొని.. లవర్ తో గ్రామ వాలంటీర్ జంప్..

పింఛన్ డబ్బులు తీసుకొని ఓ వాలంటీర్ తన ప్రియురాలితో పరారయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో ఓ గ్రామ వాలంటీర్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన పింఛన్ డబ్బులు తీసుకొని తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. పరారైన వాలంటీర్ కి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. 

ఈ విషయాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ తండ్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తండ్రి తన కుమారుడు తీసుకెళ్లిన మొత్తాన్ని సచివాలయ సిబ్బందికి అందజేశారు. పింఛన్ దారులు ఇబ్బంది పడకుండా డబ్బులు మొత్తం ఇచ్చేశాడు. సచివాలయ సిబ్బంది ఆ డబ్బులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెళ్లయి పిల్లలు ఉన్న వాలంటీర్ ఇలా చేయడంపై అమ్మాయి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Comment