గుడ్ ఐడియా – పేపర్ తో పాటు మాస్క్ ఇచ్చిన ఉర్దూ పత్రిక

శ్రీనగర్ కు చెందిన రోషిణి ఉర్దూ దినపత్రిక వినూత్న ఆలోచన చేసింది. తన పాఠకులకు పేపర్ తో పాటు మాస్క్ ను అందజేసింది. ఆ మాస్కును పాఠకులు ధరించాలంటూ సూచించింది. పేపర్ యొక్క మొదటి పేజీలో సగ భాగం ఖాళీగా ఉంచింది.

ఒక మాస్కును కవర్ లో పెట్టి పేపర్ కు పిన్ చేశారు. పక్కన ఉర్దూలో ‘మాస్కు ధరించడం ముఖ్యం’ అంటూ ఒక సందేశాన్ని కూడా రాశారు.

ప్రజలకు మాస్కు ధరంచడం ఎంత ముఖ్యమో తెలిపేందుకు ఇలా చేశామని రోషిణి దినపత్రిక ఎడిటర్ జహూర్ షారో వివరించారు.  

 

Leave a Comment