అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ సడలింపుల్లో భాగంగా పలు కీలక రంగాలకు ఆంక్షలు తొలగించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సర్వీసులు దశల వారీగా ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి కొత్త నిబంధనల్లో భాగంగా సామాజిక, రాజకీయ, విద్యా, క్రీడలు, మత మరియు ఇతర కార్యక్రమాల్లో 100 మందికి అనుమతి ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, మాల్స్ కు అనుమతి లేదు..
అన్ లాక్ 4.0 కొత్త మార్గదర్శకాలు ఇవే..
- సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
- సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, మాల్స్ బంద్, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్
- సెప్టెంబర్ 21 నుంచి స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, రాజకీయ, మతపరమైన సమావేశాలకు 100 మందికి అనుమతి
- సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి
- అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగించిన కేంద్రం
- అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
- చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం
- అత్యవసరమైతేనే బయటకు రావాలన్న కేంద్రం
- సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు