సురేష్ రైనా కుటుంబంలో విషాదం..!

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్లో విషాదం జరిగింది. రైనా మామ(మేనత్త భర్త) అశోక్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగుల దాడిలో అశోక్ ప్రాణాలు కోల్పోగా, నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పటాన్ కోట్ సమీపంలోని మదోపూర్ గ్రామంలో రైనా మేనత్త కుటుంబం ఉంటుంది. వారి ఇంట్లో కొంత మంది దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. 

ఆ సమయంలో అశోక్ తో పాటు కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. అప్పుడు ఆ దుండగులు బలమైన ఆయుధాలతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో అశోక్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అశోక్ ప్రభుత్వ కాంట్రాక్టర్ గా ఉన్నత స్థానంలో ఉన్నాడు. దీంతో సురేష్ రైనా ఐపీఎల్ పర్యటనను ఉన్నపళంగా రద్దు చేసుకున్నాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సురేష్ రైనా అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నాడు. 

Leave a Comment