అన్ లాక్ 4.0 మార్గదర్శాకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 21 నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే దీని కోసం విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వక అంగీకారం తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా అదే రోజు నుంచి పీజీ, పీహెచ్డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 21 నుంచి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతిచ్చింది.
మార్గదర్శకాలు
- 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది.
- ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
- 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు అనుమతి నిరాకరించింది..