మద్యం మత్తులో.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు..!

మద్యం మత్తులో ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు.. ఒకరి మెడలో మరొకరు తాళి కట్టారు.. అంతేకాదు తాళి కట్టిన యువకుడి ఇంటికి.. తాళి కట్టించుకున్న యువకుడు కాపురానికి వెళ్లాడు.. తాళి కట్టిన యువకుడి తల్లిదండ్రులు మరొ యువకుడిని మందలించారు. ఇంటి నుంచి పంపించారు.. 

దీంతో ఆ యువకుడు మనస్థాపానికి గురయ్యాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేశాడు. ఇదేం కేసురా బాబూ అంటూ పోలీసులు తప్పనిపరిస్థితిలో కేసు నమోదు చేశారు. పైగా ఆ యువకుడు తనకు రూ.లక్ష నష్టపరిహారం ఇస్తేనే కేసు వాపసు తీసుకుంటానని మొండికేశాడు.. ఈ విచిత్ర ఘటన తెలంగాణలో మెదక్ జిల్లా చిలప్ చెడ్ లో మంగళవారం చోటుచేసుకుంది. 

సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడికి.. చిలప్ చెడ్ మండలం చండూర్ కి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవర్ కి కొల్చారం మండలం దుంపలకుంటలోని ఓ కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. ఈ నెల 1న ఇద్దరూ ఫూటుగా తాగారు. ఆ మైకంలో చండూర్ యువకుడు తాళి కట్టగా.. జోగిపేట యువకుడు కట్టించుకున్నాడు. 

ఈ వ్యవహారంలో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. చండూర్ యువకుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఇప్పించారు. దీంతో ఈ విచిత్ర పెళ్లికి శుభం కార్డు పడింది. జోగిపేట యువకుడు కేసు వాపసు తీసుకున్నాడు.

 

Leave a Comment