బట్టలు ఆరేసిన తీగకు కరెంట్.. ఇద్దరు మృతి..!

కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. బట్టలు ఆరేసిన తీగకు విద్యుత్ సరఫరా కావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. వివరాల మేరకు జిల్లాలోని శంకేశ్వర పట్టణంలో నివాసం ఉంటున్న శాంతవ్వ బస్తవాడే వర్షం మొదలుకావడంతో ఇంటి వెనుక ఉన్న ఇనుప తీగపై ఆరేసిన బట్టలు తెచ్చేందుకు వెళ్లింది. ఆ తీగకు అక్కడే ఓ స్తంభానికి ఉన్న కరెంట్ వైర్ తాకుతోంది. దీనిని శాంతవ్వ గమనించలేదు. 

బట్టలు తీసుకునేందుకు ఆ తీగపై చేయి వేసింది. అంతే ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో అక్కడే ఉన్న ఆమె మనవడు సిద్ధార్థ బస్తవాడే నానమ్మను కాపాడేందుకు ప్రయత్నించాడు. అతడికి కూడా షాక్ కొట్టింది. దీంతో శాంతవ్వ, సిద్ధార్థ అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన శాంతవ్వ కొడలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.  

Leave a Comment