రంజాన్ నెలలో వీటికి వెసులుబాటు..

పవిత్ర రంజాన్ నెల రెండు మూడు రోజుల్లో ప్రాంరభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా రంజాన్ నెలను ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముస్లిం ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వం కొన్ని వెసులుబాటు కల్పించినట్లు ఏపీ వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది.

వెసులుబాటు కల్పించిన అంశాలు..

  1. 24×7 విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉంటుంది.
  2. ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చూస్తుంది.
  3. కూరగాయలు, పండ్లు, మిగతా అన్ని నిత్యవసర సరుకులు ఉదయం 10 గంటల వరకు  అందుబాటులో ఉంటాయి.
  4. సాయంత్రం ఇఫ్తార్ సమయానికి పండ్ల ఫలాలు,డ్రై ఫ్రూట్స్ అమ్మేందుకు అనుమతి.
  5. సామాజిక దూరం పాటిస్తూ ఉదయం 3 – 4.30 గంటల వరకు మరియు సాయంత్రం 5.30 – 6.30 గంటల వరకు దాతలు ఎవరైనా పేదలకు దానం చేయవచ్చు.
  6. మీ నగరాలలో కొన్ని హోటల్స్ ను గుర్తించి సహరి ఇఫ్తార్ సమయాలలో మాత్రమే భోజనం మరియు ఇతర తినబండారాలు అందుబాటులో ఉండే విధంగా చూస్తుంది.
  7. క్వారన్ టైన్ లో ఉన్న ముస్లిం లకు సహరి మరియు ఇఫ్తార్ సమయంలో వ్యాధి నిరోధక శక్తి మరియు సామర్ధ్యాన్ని  పెంచే ఆహారాన్ని ప్రభుత్వమే అందిస్తుంది.
  8. ఇమామ్ మరియు మౌజన్ లకు 5 పూటలా నమాజులు చదివించి మస్జీద్ నుండి ఇంటికి మరియు ఇంటి నుండి మస్జీద్ కి వెళ్లే వెసులుబాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
  9. పైన ఉన్న ప్రభుత్వ సూచనలను ప్రతి మస్జీద్ లో బ్యానర్ రూపంలో ప్రదర్శించాలని ప్రభుత్వం కోరింది.

 

 

Leave a Comment