ప్రకాశం జిల్లాలో భర్తకు గుడికట్టిన భార్య

భర్తను దైవంగా భావించింది. భర్త మరణాంతరం గుడి కట్టి నిత్యం పూజిస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతికి 21 ఏళ్ల క్రితం వివాహమైంద. దురదృష్టవశాత్తు అంకిరెడ్డి నాలేగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 

పద్మావతి తన భర్త అంకిరెడ్డిని స్మరించుకుంటూ ఉంటోంది. ఈక్రమంలో భర్త మాదిరి పాలరాతి విగ్రహం ఏర్పాటు చేసింది. ఆ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తుంది. అంతే కాదు భర్త పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి పౌర్ణమికి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం కూడా చేస్తుంది.   

 

Leave a Comment