‘సౌత్ వారికి నడుము అంటే పిచ్చి’.. దుమారం రేపుతున్న పూజా హెగ్డే వ్యాఖ్యలు..!

తెలుగు మంచి ఆఫర్లతో దూసుకుపోతుంది పూజా హెగ్డే..ఇప్పటికే దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పూజాకు అవకాశాలు దక్కుతున్నాయి. కాగా పూజా హెగ్డే సౌత్ ఇండస్ట్రీ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మరాయి. ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో హీరో తన కాళ్లను చూడటం గురించి చర్చలో భాగంగా అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానానికి విమర్శలు వస్తున్నాయి. 

ఇంతకు పూజా ఏమన్నారంటే.. సౌత్ వారికి నడుము భాగం అంటే పిచ్చి అని, అందరి కళ్లు నడుముపైనే ఉంటాయని చెప్పింది. ఈ మాటలకు సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సౌత్ లో పాపులారిటీ పొంది, ఈ ఇండస్ట్రీ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని, చాలా మంది హీరోయిన్లు ఇలానే చేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. గతంలో కూడా తాప్సీ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. రాఘవేంద్రరావుకు బొడ్డుపై కొట్టడం ఏం పిచ్చో అంటే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత మరి కొందరు హీరోయిన్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.    

Leave a Comment