రాబోయే రోజులు చాలా ప్రమాదకరం..మహంకాళి ఉజ్జయిని మాత భవిష్యవాణి.. !

రాబోయే రోజులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్వర్ణలత హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల సందర్భంగా సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత మహంకాళి ఆలయంలో పచ్చికుండపై నిలబడి కరోనా వైరస్, ఇతరాత్ర వాటిపై భవిష్యవాణి వినిపించారు. 

‘ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదు.. కాపాడుకుందాం అనుకున్నా కానీ మీ చేతులారా చేసుకుంటున్నారు. భక్తులు లేకుండా బోనాలు చేయడం నాకు సంతోషం లేదు..రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ముందుగానే హెచ్చరిస్తున్నా..  నా భక్తులనీ , నా బిడ్డలను కాపాడుకుంట’ అంటూ స్వర్ణలత భవిష్య వాణి చెప్పారు. 5 వారాల పాటు అమ్మవారికి సాక పోసి, యాగాలు పూజలతో మొక్కులు చెల్లిస్తే తప్పనిసరిగా కాపాడుతానని చెప్పారు. గంగా దేవీకి యాగాలు చేస్తే శాంతిస్తుందని పేర్కొన్నారు. గడప గడప నుంచి అమ్మవారికి తప్పనిసరిగా బోనం వచ్చినప్పుడే తనకు సంతోషం కలుగుతుందని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 

Leave a Comment