రాజకీయాలపై సోనూసూద్ కీలక ప్రకటన.. పంజాబ్ ఎన్నికల్లో..!

కరోనా సమయంలో తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.. ప్రజల నుంచి విశేష ఆదరణ పొందారు. ఈనేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు రాజకీయ ఎంట్రీ గురించి ప్రకటించని సోనూసూద్.. తాజాగా కీలక ప్రకటన చేశారు.. 

రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి మాళవిక సూద్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే అంశాన్ని మాత్రం సోనూసూద్ వెల్లడించలేదు. మెగాలోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశంలో సోనూసూద్ మాట్లాడారు. మాళవిక పోటీకి సిద్ధమయ్యారని, ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిదని అన్నారు. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయమన్నారు. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయం ప్రకటిస్తామని సోనుసూద్ వెల్లడించారు. కాగా సోనూసూద్, ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవల పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీని కలిశారు..

Leave a Comment