లాక్ డౌన్ లో మొదలైన నటుడు సోనూ సూద్ ఔదార్యం కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ సమయంలో పరాయి రాష్ట్రాల్లో చిక్కుకున్న ఎంతో మందిని సొంత డబ్బులతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి సొంతిళ్లకు పంపించిన సంగతి తెలిసిందే.. మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ గ్రామానికి చెందిన స్వాప్నిల్ అనే విద్యార్థిని కొండపైకి వెళ్లి చిన్న గుడిసెలో చదువుకుంటోంది. ఆమెకు గ్రామానికి సోనూసూద్ వైఫై సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చాడు.
తాజాగా సోనూ సూద్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆమె గ్రామానికి సోనూ సూద్ వైఫ్ సౌకర్యం కల్పించాడు. కొండపై గుడిసె వేసుకుని చదువుకున్న ఆమె ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే ఆన్ లైన్ లో పాఠాలు వింటోంది. ప్రస్తుతం ఆమె ఎంబిబిఎస్ ఎంట్రెన్స్ టెస్టు కోసం ప్రిపేర్ అవుతోంది.