మారు వేషంలో ఏఎస్పీ తనిఖీ.. పోలీసులు షాక్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ అమలు అవుతోంది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి బయటకు వస్తే బండి సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే లాక్ డౌన్ కఠినంగా అమలవుతుందా? లేదా? అన్న దానిపై పోలీసులు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. 

ఈక్రమంలో సిద్ధిపేట ఆడిషనల్ ఎస్పీ మారు వేషంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. తలకు రుమాలు ధరించి, పాత మోటార్ బైక్ పై ఎక్కి ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర ఒక్కోరంగా పోలీసులకు సమాధానాలు ఇచ్చి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.. 

ఒక చోట మెడిసిన్స్ కావాలని, మరో చోట మంత్రి పీఏ రెకమెండేషన్ అని, ఇంకో చోట పాలు పోసేందుకు వెళ్తున్నానని చెప్పారు. కానీ పోలీసులు అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లనీయకుండా ఆపేశారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుండడంపై ఏఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన తలకు ఉన్న రుుమాలు లేకుండా వచ్చారు. దీంతో ఏఎస్పీని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు..

Leave a Comment