ప్రాణాల మీదకు తెచ్చిన సెల్పీ..!

సరదా కోసం చేసిన రిస్క్ వారి ప్రాణాల మీదకు తెచ్చింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడారు. మధ్య ప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలోని ఆరుగురు యువతులు పెంచ్ నది తీరం వద్ద విహార యాత్రకు వెళ్లారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ తీసుకునేందుకు నది మధ్యలో ఉన్న ఒక బండ రాయిపై సెల్పీ దిగేందుకు వెళ్లారు. అకస్మాత్తుగా నది ప్రవాహం వేగవంతమైంది. దీంతో ఇద్దరు అమ్మాయిలు నదీ మధ్యలో చిక్కుకుపోయారు.   

 దీంతో అక్కడున్న వారు, స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 12 మంది సిబ్బందితో కూడిన పోలీసు టీమ్ స్థానికులతో కలిసి అమ్మాయిల ప్రాణాలను కాపాడింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 

Leave a Comment