రూమర్స్ పై లైవ్ లో క్లారిటీ ఇచ్చిన సమంత..!

గతకొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. జాతీయ మీడియాలో సైతం వీరి విడాకులపై పలు కథనాలు వెలువడ్డాయి. విడాకులు విషయంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఏదీ నిజమో తెలియక ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ జంట కూడా విడాకులపై స్పందించింది లేదు.

ఈ రచ్చ అంతా సోషల్ మీడియా అకౌంట్ లో సమంత తన పేరు పక్కన అక్కినేని అనేది తీసేయడంతోనే స్టార్ట్ అయింది. అయితే సమంత చేసే కొన్ని పోస్టులు, ఆమె ప్రవర్తన ఆ వాదనకు మరింత బలం చేర్చాయి. ఇక సమంత హైదరాబాద్ వదిలి ముంబై వెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. తన భర్త నటించిన లవ్ స్టోరీ సినిమాపై కూడా సమంత పెద్దగా స్పందించలేదు. నాగచైతన్య సినిమాలు విడుదలైతే సమంత ఎక్కువగా ప్రమోషన్లలో పాల్గొంటుంది. కానీ ఈసారి ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి సక్సెస్ మీట్ వరకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో సమంత, నాగచైతన్య విడిపోవడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి..

అనేక వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు స్పందించని సమంత తాజాగా ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చారు. తన దస్తుల బ్రాండ్ ‘సాకి’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఫ్యాన్స్ లో ఒకరు మీరు ముంబైకి వెళ్లిపోతున్నారా? అని అడిగారు. అందుకు సమంత కుండ బద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పింది. తాను హైదరబాద్ వదిలి పెట్టి ఎక్కడికి వెళ్లను. ఎప్పటికీ హైదరాబాదే నా ఇల్లు. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది. తాను ఇక్కడే ఉంటాను. దీంతో పాటు అనేక రూమర్స్ వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో కూడా తనకు అర్థం కావడం లేదని పరోక్షంగా విడాకులపై స్పందించింది. 

Leave a Comment