ఛార్మితో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్..!

దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్, నిర్మాత ఛార్మి రిలేషన్ షిప్ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాళ్లిద్దరు సహజీవనం చేస్తున్నారని, అందుకే పూరీ తన భార్యకు దూరమయ్యాడని ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిపై ఇద్దరు ఎప్పుడు స్పందించలేదు.. తాజాగా లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ లను ఛార్మి ఇంటర్వ్యూ చేసింది.. ఈసందర్భంగా ఛార్మితో ఎఫైర్ పై పూరి జగన్నాథ్ స్పందించారు.. 

ఛార్మీ తనకు పదమూడేళ్ల వయసప్పటి నుంచి తెలుసని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. సుమారు 20 ఏళ్ల నుంచి ఆమెతో కలిసి పనిచేస్తున్నానన్నారు. ఇదే ఛార్మీ ఒక 50 ఏళ్ల మహిళ అయితే ఎవరూ మా విషయాన్ని పట్టించుకునే వారు కాదని అన్నారు. అదే ఒకవేళ ఛార్మీకి వేరే వాళ్లతో పెళ్లి అయినా పట్టించుకునే వారు కాదని అదేమీ లేకపోవడంతోనే అఫైర్ ఉందని, అదీ ఇదీ అంటూ ఏదేదో మాట్లాడుకుంటున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

అంతేకాక తమ ఇద్దరికీ నిజంగానే అఫైర్ ఉన్నా అది ఎక్కువ రోజులు నిలబడదన్న పూరీ అట్రాక్షన్ అనేది కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుందని వేదాంతం చెప్పుకొచ్చారు. స్నేహమే శాశ్వతమన్న ఆయన తాను ఛార్మీ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. 

Leave a Comment