ప్రకాశం జిల్లాలో దారుణం.. కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి..యువతి నగ్న చిత్రాలు తీసి..!

ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది..ఓ ఇంటర్ విద్యార్థినికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించి.. ఆమె నగ్న చిత్రాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.. ఆ ఫొటోలను తన స్నేహితుడికి పంపించాడు. సదరు స్నేహితుడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.. 

వివరాల మేరకు.. పెద్ద దోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి(19) డిప్లొమా చదువుతున్నాడు. ఇటీవల మార్కాపురంలో అతడికి తెలిసిన ఇంటర్ విద్యార్థిని ఎదురైంది.. స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వచ్చినట్లు చెప్పింది. ఇద్దరికి పరిచయం ఉండటంతో మాటలు కలిపిన మీరావలి.. కూల్ డ్రింక్ తాగుదామని ఆమెను తీసుకెళ్లాడు.. 

ఆ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆ విద్యార్థినికి ఇచ్చాడు. అది తాగిన విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత ఆ యుకుకుడు ఆమెను వివస్త్రను చేసి.. తన సెల్ ఫోన్ లో నగ్న చిత్రాలను చిత్రీకరించాడు. ఆ ఫొటోలను తన స్నేహితుడు రసూల్(22)కి పంపించాడు. రసూల్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు బుధవారం రాత్రి పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీరావలి, రసూల్ ని అరెస్ట్ చేశారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

   

 

Leave a Comment