‘బుల్లెట్ బండి’ పాటకు ఏపీలో మరో పెళ్లి కూతురు డ్యాన్స్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బుల్లెట్ బండెక్కి వచ్చెత్తాపా’ పాటే వినిపిస్తోంది.. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో అయితే ఈ పాట తప్పనిసరి అయిపోయింది. ఈ పాట లేకుండా అసలు వేడుకే లేనట్లుగా మారిపోయింది. వెళ్లి చేసుకుంటున్న వధువులు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తు అదరగొడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు సాయిశ్రియ తన భాగస్వామికి సర్ ప్రైజ్ ఇవ్వాలని చేసిన డ్యాన్స్ బాగా పాపులర అయింది. ఈ పాటకు ఆమె వేసిన స్టప్పులకు పెళ్లి కొడుకే కాదు.. నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. ఈ పాట సోషల్ మీడియాలో కోట్లాది వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేసింది. 

ఈ ఒక్క డ్యాన్స్ తో పెళ్లి కూతురు సాయిశ్రియకు కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా సెలబ్రెటీగా మారిపోయింది. ఆ వధువుకు సాంగ్ నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. తమ సంస్థలో తర్వాత వచ్చే పాటకు ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ పాటకు వయస్సుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అందరూ స్టెప్పులేస్తున్నారు. ఈ పాట ఎంత మంది డ్యాన్స్ చేసినా కొత్తగా, అందంగా కనిపిస్తోంది. అందరికి నచ్చేస్తోంది. 

తాజాగా ఈ పాటకు మరో పెళ్లి కూతురు కూడా స్టెప్పులు వేసింది. పెళ్లి రిసెప్షన్ లో ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా’ అంటూ ఆడిపాడింది. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం కురాకువారి పల్లెలో పెళ్లి కూతురు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఆర్మీలో పనిచేస్తున్న శ్రీకాంత్ కు తేజశ్రీ అనే అమ్మాయితో ఈనెల 27న వివాహం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి కూతురు తేజశ్రీ బుల్లెట్ బండి పాటకు పెళ్లి కొడుకు ముందు డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. 

 

View this post on Instagram

 

A post shared by sumanagesh (@sumanageshpaina)

Leave a Comment