‘ప్రధాని మోడీ చైనాకు లొంగిపోయారు’

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాకు లొంగిపోయారుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే..ఈ సమావేశంలో మోడీ మాట్లాడారు.. ‘భారత భూభాగంపై ఎవరూ రాలేదు..సరిహద్దు క్షేమమే..మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. భారత దేశం శాంతిని, స్నేహ బంధాన్ని కోరుకుంటుందని అన్నారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. 

ఈ విషయంపై శనివారం రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీని విమర్శించారు. మన భూభాగాన్ని చైనాకు ప్రధాని మోడీ అప్పగించారని ఆరోపించారు. ఒక వేళ భూభాగం చైనాదైతే..మరి మన సైనికులు ఎందుకు చంపబడ్డారని ప్రశ్నించారు. అయితే భారత జవాన్లను ఎక్కడ చంపారో చెప్పాలని కోరారు. 

Leave a Comment