‘మీరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు’..  మోహన్ బాబుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిపబ్లిక్.. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలో ఇబ్బందులు, ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాట్లాడారు. అదే సమయంలో నటుడు మోహన్ బాబుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మోహన్ బాబు స్పందించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులు మీ బుంధువుల కదా అని, సినీ ఇండస్ట్రీని హింసించొద్దని చెప్పాలని కోరారు. కావాలంటే పవన్ కల్యాణ్ ను బ్యాన్ చేసుకోవాలని, కానీ సినీ ఇండస్ట్రీ జోలికి రావద్దని వైసీపీ పెద్దలకు చెప్పాలని అన్నారు. ఈ అంశంపై మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మోహన్ బాబుపై కూడా ఉందన్నారు. నేడు సినీ ఇండస్ట్రీకి అమలు చేస్తున్న రూల్స్.. రేపటి రోజు మీ విద్యానికేతన్ స్కూళ్లకు కూడా అమలు చేయవచ్చని, నా వరకు రాలేదు కదా అని గమ్మునుండటం సరికాదని పవన్ కళ్యాన్ చెప్పారు. ఈ చర్యలు రేపటి రోజున మీకు కూడా సమస్యగా మారొచ్చని, అప్పుడు మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోని స్పందించాలని మోహన్ బాబును ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. 

 

 

Leave a Comment