రూ.2 వేల నోటుపై కొత్త ప్రకటన..

గత కొద్ది రోజులుగా రూ.2వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందనే వార్తలు షికార్లు కొడుతున్నాయి. అయితే తాజాగా రూ.2వేల నోటుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ప్రజలు కష్టాలపాలు చేసింది. ఆ తర్వాత ఆర్బీఐ రూ.2వేల నోటు తెచ్చినా ప్రజలకు చిల్లర కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత కొత్త రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తెచ్చినా పాత నోట్లను కూడా కొనసాగిస్తోంది. కొత్తగా రూ.2వేలు, రూ.200 మినహా మిగతావన్నీ గతంలో ఉణ్న కరెన్సీయే. ఈ క్రమంలోనే రూ.2వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందనే పుకార్లు హల్ చల్ చేయడంతో దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 

రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్ సభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రూ.2వేల నోట్ల ప్రింటింగ్ నిలిపివేసే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. రూ.2వేల నోట్లకు చిల్లర కొరతతో వినియోగదారులకు ఇబ్బందిగా మారిందని, దీంతో రూ.500, రూ.200 నోట్లు ఉంచేందుకు ఏటీఎంలను సిద్ధం చేయాలని, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ తమ అధికారులను ఆదేశించాయని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరణ ఇచ్చారు. 

Leave a Comment