ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేశారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవడేకర్, డా.హర్షవర్ధన్ లాంటి 12 మంది సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. ఏడుగురికి పదోన్నతులు కల్పించారు. కొత్తగా 36 మందిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. పునర్వ్యస్థీకరణలో మహిళలకు, యువనేతలకు అధిక ప్రాధన్యత కల్పించారు.
11 మంది మహిళలు, 27 మంది ఓబీసీలకు అవకాశం కల్పించారు. వీరిలో ఐదుగురు కేబినెట మంత్రులు, 8 మంది ఎస్టీలు ఉండగా ముగ్గురికి కేబినెట్ ర్యాంక్, 12 మంది ఎస్సీ మంత్రుల్లో ఇద్దరికి కేబినెట్ ర్యాంక్ లభించింది. మొనారిటీ వర్గాల్లో ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ మతాల నుంచి ఒక్కొక్కరు, బౌద్ధ మతం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఐదుగురికి చోటు దక్కింది. విద్యావేత్తలకు అవకాశం కల్పించారు. విస్తరణ అనంతరం దేశంలో మొత్తం 25 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభించింది.
విస్తరణకు ముందు మోడీ మంత్రి మండలిలో 53 మంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 77కి చేరింది. బుధవారం 43 మంది ప్రమాణస్వీకారం చేయగా అందులో 36 మందిని కొత్తగా మంత్రి మండలిలో తీసుకున్నారు. పాతవారిలో ముగ్గురు సహాయ మంత్రులు, నలుగురు స్వతంత్ర మంత్రులకు కేబినెట్ లో స్థానం కల్పించారు. ఇలా ప్రమోషన్ అందుకున్న వారిలో తెలంగాణకు చెందిన జి.కిషన్ రెడ్డి ఉన్నారు.
Modi New Cabinet : కేబినెట్ మంత్రులు.. శాఖల కేటాయింపు..
నరేంద్ర మోడీ: ప్రధాన మంత్రి
రాజ్ నాథ్ సింగ్: రక్షణ శాఖ
అమిత్ షా: హోం, సహకార
నిర్మలా సీతారామన్: ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
ఎస్.జయశంకర్: విదేశీ వ్యవహారాలు
నితిన్ గడ్కరీ: రహదారి రవాణా, జాతీయ రహదారులు
నరేంద్ర సింగ్ తోమర్: వ్యవసాయం, రైతుల సంక్షేమం
ప్రహ్లాద్ జోషి: పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనులు
గజేంద్ర సింగ్ షెకావత్: జల శక్తి
స్మృతి ఇరానీ: మహిళ, శిశు సంక్షేమం
పీయూష్ గోయల్: వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, వనియోగదారుల వ్యవహారాలు, జౌళి
అర్జున్ ముండా: గిరిజన వ్యవహారాలు
ధర్మేంద్ర ప్రధాన్: విద్య, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికం
నారాయణ్ రాణె: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
సర్వానంద్ సోనోవాల్: ఓడ రేవులు, నౌకాయానం, జలమార్గాలు, ఆయూష్ శాఖ
ముఖ్తార్ అబ్బాస్ నక్వీ: మైనారిటీ వ్యవహారాలు
వీరేంద్ర కుమార్: సామాజిక న్యాయం, సాధికారత
గిరిరాజ్ సింగ్: గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
జ్యోతిరాదిత్య సింథియా: పౌర విమానయానం
రామచంద్ర ప్రసాద్ సింగ్: ఉక్కు
అశ్విని వైష్ణవ్: రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్
పశుపతి కుమార్ పారస్: ఆమార శుద్ది పరిశ్రమలు
కిరణ్ రిజిజు: న్యాయశాఖ
రాజ్ కుమార్ సింగ్: విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు
హర్ దీప్ సింగ్ పురి: పెట్రోలియం, సహజవాయువు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం
మాన్ సుఖ్ మాండవీయ: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు
భూపేందర్ యాదవ్: పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, కార్మిక, ఉపాధి
మహేంద్ర నాథ్ పాండే: భారీ పరిశ్రమలు
పురుషోత్తం రూపాలా: మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ
జి.కిషన్ రెడ్డి: సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల, అభివృద్ధి
అనురాగ్ ఠాకూర్: సమాచార, ప్రసార శాఖలు, క్రీడలు, యువజన వ్యవహరాలు
స్వతంత్ర హోదా సహాయ మంత్రులు వీరే:
రాజ్ ఇంద్రజిత్ సింగ్: ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు(స్వతంత్ర హోదా), కార్పొరేట్ వ్యవహారాలు(సహాయ హోదా)
జితెంద్ర సింగ్: శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, భూవిజ్ఞాన శాస్త్రం(స్వతంత్ర హోదా), ప్రధాని కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం(సహాయ హోదా)
సహాయ మంత్రులు వీరే:
శ్రీపాద యశో నాయక్: ఓడరేవులు, నౌకాయానం, జల మార్గాలు, పర్యటకం
ఫగన్ సింగ్ కులస్థె: ఉక్కు, గ్రామీణాభివృద్ధి
ప్రహ్లాద్ సింగ్ పటేల్: జల్ శక్తి, ఆహార శుద్ధి పరిశ్రమలు
అశ్విని కుమార్ చౌబె: పర్యావరణం, అడవులు, వాతావరణ శాఖ
అర్జున్ రామ్ మేఘ్ వాల్: పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతికం
వీకే సింగ్: రహదారి రవాణా, జాతీయ రహదారులు, పౌర విమానయానం
క్రిషన్ పాల్: విద్యుత్, భారీ పరిశ్రమలు
దన్వే రావ్ సాహెబ్ దాదా రావ్: రైల్వే, బొగ్గు గనులు
రామ్ దాస్ అథావలె: సామాజిక న్యాయం, సాధికారత
సాధ్వి నిరంజన్ జ్యోతి: వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, గ్రామాణాభివృద్ధి
సంజీవ్ కుమార్ బాల్యాన్: మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ
నిత్యానంద్ రాయ్: హోం
పంకజ్ చౌదరి: ఆర్థిక
అనుప్రియ పటేల్: పరిశ్రమలు, వాణిజ్యం
ఎస్.పి.సింగ్ బఘేల్: న్యాయ
రాజీవ్ చంద్రశేఖర్: నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికం, ఎలక్ట్రానిక్స్, ఐటీ
శోభ కరంద్లాజె: వ్యవసాయం, రైతుల సంక్షేమం
భానుప్రతాప్ సింగ్ వర్మ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
దర్శన విక్రమ్ జర్దోస్: జౌళి, రైల్వే
వి.మురళీధరన్: విదేశీ వ్యవహరాలు
మీనాక్షి లేఖ: విదేశీ వ్యవహారాలు,సాంస్కృతిక
సోమ్ ప్రకాశ్: వాణిజ్యం, పరిశ్రమలు
రేణుక సింగ్ సరూతా: గిరిజన వ్యవహారాలు
రామేశ్వర్ తేలి: పెట్రోలియం, సహజవాయు, కార్మిక ఉపాధి
కైలాస్ చౌదరి: వ్యవసాయం, రైతుల సంక్షేమం
అన్నపూర్ణ దేవి: విద్య
ఎ.నారాయణ స్వామి: సామాజిక న్యాయం, సాధికారత
కౌశల్ కిశోర్: గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
అజయ్ భట్: రక్షణ, పర్యటకం
బీఎల్ వర్మ: ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార
అజయ్ కుమార్: హో
దేవ్ సిన్హా చౌహాన్: కమ్యూనికేషన్స్
భగవంత కుబ: ఎరువులు, రసాయనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు
కపిల్ మోరేశ్వర్ పాటిల్: పంచాయతీ రాజ్
ప్రతిమ భౌమిక్: సామాజిక న్యాయం, సాధికారత
సుభాష్ సర్కార్: విద్య
భగవత్ కిషన్ రావ్ కరాడ్: ఆర్థిక
రాజ్ కుమార్ రంజన్ సింగ్: విదేశీ వ్యవహారాలు, విద్య
భారతి ప్రవీణ్ పవార్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
విశ్వేశ్వర్ టుడు: గిరిజన వ్యవహారాలు జలశక్తి
శంతన్ ఠాకుర్: ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాలు
ముంజపర మహేంద్రబాయి: మహిళ, శిశు సంక్షేమం, ఆయూష్
జాన్ బార్ల: మైనారిటీ వ్యవహారాలు
ఎల్.మురగన్: మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార
నిశిత్ ప్రామాణిక్: హోం, యువజన వ్యవహరాలు, క్రీడలు
I congratulate all the colleagues who have taken oath today and wish them the very best for their ministerial tenure. We will continue working to fulfil aspirations of the people and build a strong and prosperous India. #Govt4Growth pic.twitter.com/AVz9vL77bO
— Narendra Modi (@narendramodi) July 7, 2021