టీటీడీ బంపర్ ఆఫర్.. శ్రీవారికి శుభలేఖ పంపితే పెళ్లి కానుక..!

ఇంట్లో పెళ్లి ఉంటే మొదటి శుభలేఖ దేవుడి పాదల వద్ద పెల్లి పూజ చేస్తారు. ఇక చాలా మంది తిరుమల శ్రీవారికి మొదటి ఆహ్వాన పత్రికను పంపాలని కోరుకుంటారు. దగ్గర వారైతే వారే స్వయంగా వచ్చి శుభలేఖ ఇస్తారు. అయితే దూరంగా ఉన్న వారి పరిస్థితి ఏంటి ? వారు శుభలేఖను పంపించడం ఎలా? అలాంటి వారికి టీటీడీ బంపర్ ఆఫర్ కల్పించింది. 

ఇంట్లో పెళ్లి నిశ్చయమయ్యాక తొలి శుభలేఖను శ్రీవారికి పంపించవచ్చు. అలా పంపితే వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. ఆ కానుకలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు, వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది.. వివాహ ఆహ్వాన మొదటి పత్రికను కొరియర్ ద్వారా పంపవచ్చు..

కొరియర్ చేయాల్సిన చిరునామా ఇదే:

శ్రీ లార్డ్ వేంకటేశ్వ స్వామి,

ది ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, 

టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్,

కేటీ రోడ్డు,  

తిరుపతి..

Leave a Comment