నాగబాబు షేర్ చేసిన ఫొటోలో పవన్ కళ్యాణ్ ని మిస్ చేశారు..!

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన హీరో.. సినీ ఇండస్ట్రీలో చిరు వేసిన బాటలో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి నట వారుసుడిగా ముందుగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. పవన్ కళ్యాణ్ మాత్రం అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలు సత్తా చాటారు. 

ఎంత మంది వచ్చినా పవన్ కళ్యాణ్ కు ఉన్న కేజే వేరు.. అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటే.. పవన్ కు మాత్రం భక్తులు ఉంటారు. పవన్ కళ్యాణ్ ను అంతగా అభిమానిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ పై ఏ చిన్న విమర్శ వచ్చిన ఊరుకోరు. ఓ రేంజ్ లో స్పందిస్తారు. మెగా ఫ్యామిలీ ఈవెంట్ లలో పవన్ రాకపోయిన, ఆయన ప్రస్తావన తీసుకుని రాకపయిన పవన ఫ్యాన్స్ రచ్చ చేస్తారు. 

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫొటోలో చిరంజీవి మధ్యలో ఉండగా, చుట్టూ మెగా హీరోలందరూ ఉన్నారు. ‘అందరికంటే మీరే యంగ్ గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్ లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్య’ అంటూ కామెంట్ జత చేశారు. 

విషయం ఏంటంటే.. నాగబాబు షేర్ చేసిన ఫొటోలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు. నాగబాబు పవన్ కళ్యాణ్ ను మిస్ చేయడంపై పవన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. తమ హీరోను ఎందుకు మిస్ చేశారు అంటూ నాగబాబను ప్రశ్నిస్తున్నారు. 

Leave a Comment