కళ్ల ముందే వాగులో కొట్టకుపోయిన తల్లీకొడుకులు..!

విశాఖ ఏజెన్సీలో విషాదం జరిగింది. వాగులో తల్లీకొడుకు కొట్టుకుపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈక్రమంలో విశాఖ మాన్యంలో కొండవాగు కూడా పొంగి వరద నీరు వచ్చాయి. విశాఖ మాన్యంలోని పెదబయలు మండలం చీకటిపల్లికి చెందిన రాములమ్మ(35), ఆమె కొడుకు ప్రశాంత్(6)తో కలిసి జి.మాడుగుల మండలం మద్దిగరువులోని వారుపు సంతకు వెళ్లింది. 

తిరుగు ప్రయాణంలో చీకుపనస వద్ద కొండ వాగు ఒక్కసారిగా పొంగింది. వరద నీరు పై నుంచి రావడంతో తల్లీకొడుకులు కొట్టుకుపోయారు. అక్కడ కొంత మంది వర్షానికి తడుస్తూ ఉన్నారు. వారి కళ్ల ముందే తల్లీకొడుకులు కొట్టుకుపోతున్నా వారు ఏమీ చేయలేకపోయారు. గ్రామస్తులు తల్లీకొడుకుల మృతదేహాలను వెలికి తీశారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగానే కళ్ల ముందు తల్లీకొడుకులు కొట్టుకుపోవడం కలచి వేస్తోంది. 

Leave a Comment